నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్నిదృష్టిలో పెట్టుకొని పాత్రికేయులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల, పరుగుల జీవితంలో జర్నలిస్టులు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వృత్తి పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వైద్య సేవలు చేయించుజ కోవాలన్నారు. ముఖ్యంగా పాత్రికేయుల సంక్షేమం కోసం హాస్పిటల్ సూపర్డెంట్ నాగేశ్వర్ రాజు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య సేవలను అందించేందుకు ముందుకు రావడం అభినందించదగ్గ విషయం అన్నారు. పాత్రికేయులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ముందుగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి వారికి కొంత సమయం ఇవ్వాలన్నారు.
Reporter
Namitha News