Thursday, 16 April 2026 08:26:46 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిఎస్పీ మహేంద్ర

Date : 24 October 2025 07:40 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 24 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను శుక్రవారం డిఎస్పీ ఎస్. మహేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు . మండల పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన డిఎస్పీ, సీఐ లకు ఎస్సై డి రమేష్ బాబు పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. డిఎస్పీ రికార్డులను పరిశీలించి పలు కేసుల వివరాలు అడిగి తెలుసు కున్నారు. డిఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యాక్రమాలకు పాల్పడినా,రౌడీయుజం, అక్రమ మద్యం, గంజాయి ప్రోత్సహించిన ఉపేక్సించేది లేదని డిఎస్పీ హెచ్చరించారు. మండల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడేందుకు.పోలీస్ సిబ్బంది ముందుంటారన్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. జనజీవానికి ఆటంకాలు లేకుండా చూసేందుకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలం లోని కర్ణాటక సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక పోలీస్ లను పెట్టామని డిఎస్పీ,సీఐ తెలిపారు. అక్రమ మద్యం, జూదం పై నిఘా ఉంచామన్నారు.కొత్త వ్యక్తుల రాకపోకలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టామని . ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ లపై ఉందన్నారు. పంచాయతీ సచివాలయాల మహిళా పోలీస్ లతో డిఎస్పీ సమావేశం నిర్వహించి గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా మద్యం, కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నారా మహిళా పోలీస్ లను అడిగారు . ఎక్కడా బెల్ట్ షాపులు, పేకాట, కోడిపందేలు లేవని డిస్పికి మహిళా పోలీసులు తెలిపారు. ఈతనిఖీల్లో సీఐ సత్యనారాయణ తో పాటు ఎస్సై రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్సై డి. రమేష్ బాబు డిఎస్పీ ఎస్ మహేంద్ర కు వివరణ తెలియజేశారు.ప్రతిరోజు మా సిబ్బంది తో కలిసి కర్ణాటక భార్డర్ లో తనిఖీ నిర్వహించడం,పలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమై గ్రామ ప్రజలు ఎలాంటి గొడవలు పెట్టుకోరాదని వారికి సలహాలు ఇస్తున్నామని డిఎస్పీ కి తెలిపారు.ఈ సమావేశంలో డీఎస్పీ మహేందర్, సీఐ సత్యనారాయణ, ఎస్సై డి. రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది, సచివాలయం మహిళా పోలీస్ లు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :