నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 16 : తంబళ్లపల్లె మండలం లో తాగునీటి సమస్యల ను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేయాలని కార్యదర్శులను ఎంపీడీవో థామస్ రాజా ఆదేశించారు. బుధవారం పరసతోపు పంచాయతీ బూదలవారిపల్లె లో తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు ఎంపీడీవోకు మొరపెట్టుకున్నారు. ఆయన వెంటనే స్పందించి ఆ గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కారానికి మోటారు మరమ్మత్తులతోపాటు పశువులకు తాగునీటి తొట్టెను వెంటనే నిర్మించాలని బోర్ మెకానిక్ మాధవరెడ్డి,ఏపీవో అంజనప్ప కు సూచించారు. అదేవిధంగా మండలంలో తాగునీటి సమస్యలపై సంబంధిత సచివాలయ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సమస్యలు వస్తే వెంటనే పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత నివ్వాలని ఆదేశించారు. తాగునీటి సమస్యపై స్పందించిన తీరుపై ఎంపీడీవో థామస్ రాజాను బూదలవారిపల్లె గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News