నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 7 : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ జాతి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ జాతికే మణిరత్నమని ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, పెద్దమండెం ఇంచార్జ్ వెంకటప్ప, మండల అధ్యక్షుడు భాస్కర్ లు కొనియాడారు. ఆదివారం తంబళ్లపల్లి క్రాస్ రోడ్ లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం తో పాటు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా పతాకావిష్కరణ తో పాటు భారీ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకు మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి అనర్వచనీయమని వర్గీకరణ సాధించేంతవరకు విశ్రమించేది లేదన్నారు. టిడిపి మహిళా నాయకురాలు సిద్ధమ్మ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఆవిర్భావం ఓ చరిత్ర అని స్థాపించిన మందకృష్ణ మాదిగ జాతికే వన్నె తెచ్చారని ఆయన తన జాతి అభివృద్ధితోపాటు దివ్యాంగులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ జిందాబాద్, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ జగదీష్, భాను ప్రకాష్,బొజ్జప్ప, గంగాధర్, శివమణి, చెన్న కృష్ణ, రమణ, టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, రామచంద్ర, చలపతి నాయుడు, రెడ్డప్ప లు పాల్గొన్నారు.
Admin
Namitha News