నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బక్రీద్ పండుగ త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీక.... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ బక్రీదు పండుగ శుభాకాంక్షలు -- పవిత్ర శుక్రవారం చల్లావారిపల్లి నూరాని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీక అయిన బక్రీదు పర్వదినాన్ని సుఖ, సంతోషాలతో జరుపుకోవాలని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆకాంక్షించారు. నేడు నిమ్మనపల్లె మండలం ముష్ఠురు పంచాయతీ చల్లావారిపల్లిలోని నూరాని మసీదులో స్దానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ శనివారం బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో మతసామరస్యం వెల్లివిరిసే విధంగా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు ఖాదర్ బాషా, అమ్జాద్ భాయ్, నిమ్మనపల్లె రఫీ, మస్తాన్, షాదు, జీలానీ భాయ్, ముబారక్ భాయ్, హైదర్ సాబ్, యూనస్, మజార్, హబీబ్, ఖిజార్ ఖాన్, జాబీల్లాస్, సాదిక్ మసీదు కమిటీ పెద్దలు పాల్గొన్నారు.
Reporter
Namitha News