నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వదంతులు వచ్చాయి. అదంతా అవాస్తవమని వైసీపీ నేత నల్లగుండ్ల మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. 'చిన్నపాటి అనారోగ్యంతో బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నేను నిన్న MLAను కలిశా. 6, 7వ తేదీల్లో ఎమ్మెల్యే స్వగ్రామం యర్రాతివారిపల్లెలో అయ్యప్ప మాలదీక్ష తీసుకుంటారు' అని ఆయన చెప్పారు.
Admin
Namitha News