నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 8 : తంబళ్లపల్లె మండలం లోని రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా జరుగుతుందని ఎవరు ఆ ధైర్య పడాల్సిన అవసరం లేదని ఏవో రమణ కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన స్పెషలాఫీసర్ అమర్నాథరెడ్డి తో కలిసి తంబళ్లపల్లె, ఎద్దులవారిపల్లి గ్రామాలలో రైతులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు ఎకరాకు బస్తా యూరియా రూ 266.50 ధర చొప్పున పంపిణీ జరుగుతుందని రెండు ఎకరాలు ఉంటే రెండు బస్తాలు పంపిణీ చేస్తామన్నారు. మండలంలో తంబళ్లపల్లె, కోసువారిపల్లె రైతు సేవ కేంద్రాల కు 9.99 మెట్రిక్ టన్నులు చొప్పున యూరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. త్వరలో అన్ని రైతు సేవ కేంద్రాలకు యూరియా సరఫరా జరుగుతుందని తెలిపారు. రైతులు సాధ్యమైనంత వరకు సేంద్రీయ ఎరువుల సేద్యానికి స్వాగతం పలికి సాధ్యమైనంతవరకు యూరియా వినియోగం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో ఏఈఓలు సురేష్, పల్లవి, రెడ్డి శేఖర్, సుధాకర్, మండల కార్యదర్శి రాజు, ఐ సి ఆర్ పి లు సుగుణమ్మ, సిద్ధమల్లు రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News