నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 12వ తేదీన కార్తీక ఏకాదశి నోములు - అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం మదనపల్లె : 09/11/2024 ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) కార్తీక ఏకాదశి నోములు జరుపుకోవాలని శ్రీయోగ భోగేశ్వర స్వామి ఆలయం (మడికయ్యల శివాలయం) ప్రధాన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.శనివారం ఆలయ ప్రాంగణంలో ఈవో రమణతో కలిసి ఆయన విలేకరులకు కార్తీక ఏకాదశి నోముల విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక ఏకాదశి నోములు ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయన్నారు.అయితే అపోహలను పూర్తిగా విడనాడి ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) జరుపుకోవాలని సూచించారు.అదేవిధంగా శ్రీయోగభోగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ రెండవ కార్తీక సోమవారం ఉదయం 6 గంటల నుండి పూజలు నిర్వహించడం,నోముల వ్రతం ఆచరించుకోవచ్చునని,అలాగే 12వ తేదీ కార్తీక ఏకాదశి నోములను పురస్కరించుకొని రుద్రాభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.భక్తులు,ప్రజలు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
12వ తేదీన కార్తీక ఏకాదశి నోములు - అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం మదనపల్లె : ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) కార్తీక ఏకాదశి నోములు జరుపుకోవాలని శ్రీయోగ భోగేశ్వర స్వామి ఆలయం (మడికయ్యల శివాలయం) ప్రధాన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.శనివారం ఆలయ ప్రాంగణంలో ఈవో రమణతో కలిసి ఆయన విలేకరులకు కార్తీక ఏకాదశి నోముల విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక ఏకాదశి నోములు ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయన్నారు.అయితే అపోహలను పూర్తిగా విడనాడి ఈనెల 12వ తేదీ అనగా (మంగళవారం) జరుపుకోవాలని సూచించారు.అదేవిధంగా శ్రీయోగభోగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ రెండవ కార్తీక సోమవారం ఉదయం 6 గంటల నుండి పూజలు నిర్వహించడం,నోముల వ్రతం ఆచరించుకోవచ్చునని,అలాగే 12వ తేదీ కార్తీక ఏకాదశి నోములను పురస్కరించుకొని రుద్రాభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.భక్తులు,ప్రజలు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
Reporter
Namitha News