నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : చదళ్ల గ్రామంలో వెలసినశ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం ముగిసాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో వేదపారాయణం, వైదికార్చన అనంతరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి మూలవిరాట్ కు పంచామృత, సుగంధద్రవ్య అభిషేకము నిర్వహించారు. నిత్య హోమం, సప్తమాతుృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి మూలమంత్ర హోమం, జయాది హోమం, ప్రాయచ్చిత్త హోమాది పూజలలో వేణుగోపాల్ రెడ్డి కుటుంబం పాల్గొని మహాపూర్ణాహుతి అందజేశారు. అమ్మవారికి విశేష అలంకరణ, అర్చన, వేదపారాయణం, మంత్రపుష్పం రిత్వికులు నిర్వహించారు.మహామంగళ హారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. సందర్భంగా ఎన్.వి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. అమ్మవారి అష్టమ వార్షికోత్సవాలను మూడు రోజులు పాటు వైభవంగా నిర్వహించారని ప్రజలు పేర్కొన్నారు.
Admin
Namitha News