నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 24 : రామసముద్రం మండలంలోని కురిజల గ్రామపంచాయతీ కురిజల గ్రామంలో డోర్ టు డోర్ యార్బేజ్ కలెక్షన్ గ్రీన్ అంబాసిడర్ ద్వారా చేయించడం జరిగింది . గ్రామంలో పారిశుద్ధ పనులు పరిశీలించి వెంటనే పారిశుద్ధ పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. గ్రామ పంచాయతీలో ఉన్న మంచినీటి నీటి ట్యాంకులను పరిశీలించి అక్కడ పరిసరాలను శుభ్రంగా గ్రీన్ అంబాసిల ద్వారా చేయించి బ్లీచింగ్ పౌడర్ ను చెల్లించారు . ట్యాంక్ కింద నీటి నిలువ లేకుండా మట్టిని తోలించి శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి కార్తీక కు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ గపూర్,సర్పంచ్ మంగమ్మ, ఎంపిటీసీ దొడ్డిపల్లె ఆనంద గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి,కార్తీక ఇంజనీరింగ్ అసిస్టెంట్,అంగన్వాడి టీచర్, సి ఆర్ పి, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు .
Admin
Namitha News