Thursday, 16 April 2026 06:45:18 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి గా నాగరాజు, ఝాన్సీ రాణి

Date : 10 September 2025 03:50 PM Views : 262

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి గా నాగరాజు, ఝాన్సీ రాణి మదనపల్లి సెప్టెంబర్ 10, (మణి నమిత న్యూస్ విలేఖరి ) : ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు రాష్ట్రం లోని అన్ని జిల్లాల స్కూల్ గేమ్స్ కార్యదర్శుల నియామక పత్రాన్ని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు అన్నమయ్య జిల్లా విద్యా శాఖ అధికారి కె. సుబ్రమణ్యం తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం సిటిఎం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు వై నాగరాజు, కలకడ మండలం కోన జిల్లా పరిషత్ హైస్కూల్ లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు ఝాన్సీరాణిని ఎంపిక చేసి ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. వీరు పాఠశాల క్రీడా సమాఖ్య కు సంబంధించిన అండర్ 14, అండర్ 17 విభాగాల బాల బాలికల క్రీడల నిర్వహణ లో, జట్ల ఎంపిక, స్కూల్ గేమ్స్ లో పాల్గొనే విధంగా తమ విధులు నిర్వర్తిస్తారని తెలియ జేశారు. మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల భద్రత సంరక్షణ దృశ్య క్రీడలలో పాల్గొన్నప్పుడు మహిళల స్కూల్ గేమ్స్ కార్యదర్శిని నియమించి వారి భద్రతకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తూ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే చర్యలో భాగంగా మహిళా సెక్రటరీని నియమించడం జరిగిందని రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి బాను మూర్తి రాజు, కమిషనర్ విజయరామరాజు తెలియ జేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :