నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 16 : తంబళ్లపల్లె మండలం లోని క్వారీలు యాజమాన్యం పేలుళ్లు చేసి ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని తాసిల్దారు హరిప్రసాద్ ఘాటుగా హెచ్చరించారు. సోమవారం ఆయన గుండ్లపల్లి క్వారీ పరిసరాలను పరిశీలించారు. క్వారీలో ఎలాంటి పేలుడు పదార్థాలు వాడరాదని రైతులకు, ప్రజలకు ఎలాంటి హాని జరిగినా కఠిన చర్యలు తప్ప వన్నారు. క్వారీలలో పేలుడు ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారి నిర్వాహకులకు సూచించారు. భవిష్యత్తులో క్వారీల యాజమాన్యం ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టరాదని సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని క్వారీలపై నిఘా పెంచి సంబంధిత ప్రభుత్వ అనుమతులు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. సంబంధిత రెవెన్యూ అధికారుల చే స్థానికంగా గల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
Reporter
Namitha News