నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 15 : మదనపల్లె శేష మహాల్ వద్ద నర్సు ఇంటిలో వ్యక్తి గుండె పోటుతో చనిపోవడం మంగళవారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎస్బిఐ కాలనీకి చెందిన లేట్ ఓబుల్ రెడ్డి గారి రంగారెడ్డి కొడుకు శ్రీనివాస గాంధీ (50) శేష మహల్ సినిమా థియేటర్ వద్ద ఉండే రిటైర్డ్ నర్సు ప్రమీల ఇంటికి వెళ్ళాడు. దాహంగా ఉందని ఆమె వంట గదికి వెళ్లి నీళ్లు తాగుతూ కుప్ప కూలి ప్రాణాలు విడిచాడని సమాచారం. వన్ టౌన్ పోలీసులు వెంటనే వెళ్లి మృత దేహాన్ని పరిశీలించి, మృతుడి భార్య సుగుణ చౌడేపల్లి విఆర్ఓ కావడంతో ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించామన్నారు.. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Admin
Namitha News