Thursday, 16 April 2026 06:58:50 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బీసీల సంక్షేమం,అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా...ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి... - బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం

Date : 29 June 2025 05:09 PM Views : 325

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బీసీల సంక్షేమం,అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా...ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి... - బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నియోజకవర్గంలోని బీసీల సంక్షేమం,అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు.ఆదివారం బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్,విజయభారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు,జనసేన నాయకులు జంగాల శివరాం రాయల్,చేనేత విభాగం నాయకులు పురుం సహదేవ,నాగినేని గోవిందు,సి.రామలింగయ్య,చిన్నరెడ్డెప్ప, సత్యసాయి జిల్లా అధ్యక్షులు షబ్బీర్,రామాంజనేయులు,రామకృష్ణ,శీను,కరామత్ బాషా,సూరిబాబు,సి.చంద్రయ్య,నరసింహులు,బాలసుబ్రమణ్యం,రాజశేఖర్,వై.వి.శేఖర్ నాయుడు,లక్ష్మీనారాయణ,బత్తుల లక్ష్మీపతి,మేస్త్రి శ్రీనివాసులు,మహమ్మద్ అలీ,ఈశ్వరమ్మ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే జహా మాట్లాడుతూ బీసీలు ప్రస్తుతం అన్నిరంగాల్లో ముందుంజ వేస్తున్నారని ప్రశంసించారు.బీసీలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కొనియాడారు.అదేవిధంగా మంత్రిమండలిలో చోటుతోపాటు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.ప్రస్తుతం రాజకీయల్లో బీసీలు క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు.అర్హులైన బీసీలందరికీ ఇంటి పట్టాలు,సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయిస్తామన్నారు.బీసీల ఐక్యతకు బోడెం రాజశేఖర్ కృషిని ఆయన ప్రశంసించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ బీసీలను కలిసికట్టుగా ముందుకు నడిపించడంలో బోడెం రాజశేఖర్ సఫలీకృతులయ్యారన్నారు.బీసీలంతా ఏకతాటిపై నడిచి రాజ్యాధికారం సాకారం చేసుకోవాలన్నారు.బీసీల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు.విజయభారతి పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీసీలకు సముచిస్థానం కల్పిస్తున్నారన్నారు.అటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడం సంతోషకరమన్నారు.అనంతరం బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ బీసీల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు,బీసీ కుల బాంధవులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.భవిష్యత్తులో బీసీల శ్రేయస్సు నిర్విరామ కృషి చేస్తామని స్పష్టం చేశారు.అంతకుముందు బీసీ నాయకులతో కలిసి మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ వద్ద గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు పాదయాత్ర నిర్వహించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :