నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 01 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లి కళాశాల నందు బి.టెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ఎస్.మొహమ్మద్ బాషా ఎలక్ట్రిక్ వాహనాలు యొక్క బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అంశం పై పరిశోధన కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎలక్ట్రికల్ ఇండియా మ్యాగజిన్ లో ప్రచురించబడిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, వివిధ మ్యానుఫ్యాక్చయిరింగ్ సెల్స్తో కూడిన బ్యాటరీ ప్యాక్లను సమర్థవంతంగా నిర్వహించడం, పాతవైన లేదా వాడిన బ్యాట్రీలో తేడా ఉన్న సెల్స్ను ఒకే బ్యాటరీ ప్యాక్లో కలిపితే, మొత్తం పనితీరు తగ్గిపోయే అవకాశమ తో పాటు, విద్యుత్ వినియోగ సామర్థ్యం తగ్గి, భద్రతాపరమైన ప్రమాదాలు ఏర్పడవచ్చు. ఇలాంటి మిశ్రమ వయస్సు సెల్స్ చార్జింగ్ సామర్థ్యం మరియు పాడయిన స్థాయిలలో తేడాలు చూపుతూ, వోల్టేజ్ మరియు వేడి పంపిణీలో అసమతుల్యతను కలిగిస్తాయి. దీని వల్ల బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) పనితీరును సమర్ధవంతంగా నియంత్రించడం కష్టమవుతుంది. కాల్మాన్ ఫిల్టర్లు మరియు మెషీన్ లెర్నింగ్ మోడల్స్ వంటి ఆధునిక ఆల్గోరిథంలను రియల్టైమ్లో గల అసమతుల్యతను గుర్తించి సరిచేయడానికి ఉపయోగిస్తున్నారు. విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ డిజిటల్ ట్విన్లు, మాడ్యులర్ కంట్రోల్, మరియు అడాప్టివ్ బ్యాలెన్సింగ్ సర్క్యూట్లు వంటి టెక్నాలజీలు బ్యాటరీల జీవితకాలాన్ని పెంచే దిశగా ముఖ్యపాత్ర పోషితున్నాయని, విభిన్న వయస్సుల సెల్స్లో ఒకే రకమైన పనితీరును నిర్ధారించడం ద్వారా బ్యాటరీ జీవితం గణనీయంగా పెరిగి , నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. ఈ వి వినియోగం పెరుగుతున్న తరుణంలో, తెలివైన బ్యాటరీ నిర్వహణ, బ్యాటరీను మించిన ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది అని అన్నారు. పరిశోధనకు సహకరించిన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మరియు మొహమ్మద్ భాషను కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అభినందనలు తెలియజేసారు.
Admin
Namitha News