నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 06 : రామసముద్రం మండలం చెంబకూరు మేజర్ పంచాయతీలో సోమవారం యస్.ఐ రమేష్ బాబు సందర్శించి పలు అంశాలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ మండలం ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకోసం జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాధ్ ఆదేశాలమేరకు చెంబకూరులో పోలీస్ లు విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ నేరాలు నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలబారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫోన్ లో ఎవ్వరైనా మెసేజ్ లో పెట్టె లింకులను క్లిక్ చేయవద్దన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికి పంచుకోవద్దని సూచించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు డ్రైవర్ లు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవన్నారు. పోలీసులు ప్రజలు మధ్య ఉంటూ వారికి రక్షణ కల్పిస్తామన్నారు. ప్రజల భద్రతకు సంబందించిన ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే మండలంకేంద్రంలో పోలీస్ సిబ్బందిలో వాహనాలు తనికీ చేశారు. సరైన పత్రాలు లేని 20 వాహనాలకు జరిమాన విధించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News