Thursday, 16 April 2026 06:37:23 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

వైసిపి తన ఉనికి చాటుకునేందుకే రైతు పోరుబాట. హెరిటేజ్ లో పాల పదార్థాలు మాత్రమే అమ్ముతారు ఉల్లిపాయలు కాదు.?

టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్

Date : 08 September 2025 04:56 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి తన ఉనికి చాటుకునేందుకే రైతు పోరుబాట. హెరిటేజ్ లో పాల పదార్థాలు మాత్రమే అమ్ముతారు ఉల్లిపాయలు కాదు.? ఇది కూడా తెలియని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ వైసిపి తన ఉనికిని చాటుకునేందుకే రైతు పోరుబాట కార్యక్రమం చేపట్టిందని టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని తన కార్యాలయం లో ఆయన మాట్లాడారు. వైసీపీ తన ఉనికిని చాటుకునేందుకే రైతు పోరు కార్యక్రమం చేపట్టిందని ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు నమ్మరని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ లో ఉల్లిపాయలు అమ్ముతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హెరిటేజ్ లో కేవలం పాలు, పాల పదార్థాలు మాత్రమే అమ్ముతారని కూడా తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే యూరియా కొరత ఎక్కడా లేదని రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో రైతులకు యూరియాను అందిస్తున్నారని తెలిపారు. ఇకపోతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇటీవల మామిడి రైతు నష్టపోతే నాలుగు రూపాయల మద్దతు ధర కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. అలాగే పొగాకు మిర్చి రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకునందిని గుర్తు చేశారు. ఉల్లిపాయలను క్వింటాలు 1200 రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తంబళ్లపల్లె పర్యటనలలో పర్యటించడం జరిగిందన్నారు. టమోటా రైతులను ఆదుకుంటానని .. ధరల స్థిరీకరణ చేపడతానని చెప్పి తర్వాత రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైకాపా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమేటాలు పరబోసిన రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పారు . ఇలా రైతుల కష్ట నష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పక్షపాతిగా కూటమి నిలబడుతోందన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నిస్సార్ అహ్మద్ కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పరిపాటి అయిందన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, చాంద్ భాషా ఎక్స్ ఎంపీటీసీ బాలినేని చంద్రశేఖర్ నాయుడు, కృష్ణప్ప, మణి ప్రకాష్, సి. బాలాజీ.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :