నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - జులై 03 : మదనపల్లి మండలం కొత్తవారి పల్లి పంచాయతీ రెడ్డిగాని పల్లె లో చంద్రశేఖర్ ఇంట్లో వాళ్ళు ఎవరూ ఉదయం నుండీ కానరాకపోవడంతో ఇంట్లోకి చూసిన గ్రామస్థులు అచేతనంగా ఉన్న చంద్రశేఖర్ ను గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలింపు . చంద్రశేఖర్ ను భార్య రమాదేవి హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన కుటుంబీకులు. ఒంటి పై రక్తగాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతి గా నమోదు తన అన్న కు రమాదేవి రెండో భార్య , ఆమె నడవడిక పై తరచూ గొడవపడేవారు. . రాత్రి నిద్రలో గొంతునులుమి హత్యచేసి వేకువజామున ఎటో వెళ్ళిపోయిందని ఆరోపిస్తున్న మృతుని తమ్ముడు . రూరల్ పోలీసుల విచారణ లో మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది
Admin
Namitha News