Thursday, 16 April 2026 06:43:34 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

శ్రీఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరగడం ఎంతో సంతోషంగా వుందని వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి

రాగిమాను సర్కిల్ వద్ద వాల్మీకి మహాసేన ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Date : 18 October 2024 06:45 PM Views : 296

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శ్రీఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరగడం ఎంతో సంతోషంగా వుందని వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరిక్రిష్ణ పేర్కొన్నారు. మదనపల్లె పట్టణం రాగిమాను సర్కిల్ వద్ద వాల్మీకి మహాసేన ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకోవడం వాల్మీకుల ఐక్యతకు నిదర్శనం అన్నారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వాల్మీకి మహర్షిపై చరగని అభిమానం చాటుకున్నా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.‌ వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి సెలవు దినంగా ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ‌రాబోయే వాల్మీకి జయంతికి నేషనల్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా వాల్మీకులకు ఎస్టీ జాబితాలో స్దానం కల్పించాలని కోరారు. వాల్మీకి సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో ఎస్టీ పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి మహాసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరికృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల సుదర్శన్ బాబు, జిల్లా అధ్యక్షులు బొగ్గిటి కృష్ణమూర్తి, జిల్లా నాయకులు సాకే కృష్ణమూర్తి, రామకృష్ణ, సుస్మిత్, సాకే మల్లప్ప, కుండబల్లి ముని వెంకటప్ప, రాగిమాకులపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :