నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బుద్ధినికొండలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు బుద్ధుని కొండలో 23వ తేదీన ఎలాంటి కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వలేదని తహశీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, సిఐ కళా వెంకట్రమణ లు తెలిపారు. అంకి శెట్టిపల్లి పంచాయతీ, నల్లగుట్టలో మదనపల్లె కి చెందిన బాస్ నేతలు బుద్ధిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని, బుద్ధుని కొండ అని నామకరణం చేసుకున్నారని, అయితే అక్కడ నెలన్నర క్రితం బుద్ధిని తల ధ్వంసం కావడంతో దానిపై కేసు నమోదు చేసి కేసును కూడా ఛేదించడం జరిగిందన్నారు. అయితే బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులు దీనిపైన అతిగా స్పందించి నిరసనలు, దీక్షలు చేపట్టారని, 23న బుద్ధిని నూతన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారన్నారు. అయితే ఆ ప్రదేశం ప్రభుత్వ స్థలం కావున అక్కడ ఎవరికీ ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతే కాకుండా చుట్టు పక్కల గ్రామస్తులు తమ పశువులు మేపడానికి కూడా కొండ మీదకు పోనివ్వడం లేదని, ఘర్షణలకు కూడా ఆస్కారం ఉందని తమకు ఫిర్యాదు చెయ్యడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
Reporter
Namitha News