నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంబేపల్లి జూన్ 3 : సంబేపల్లె మండలం, ఎగువరాచపల్లె , గున్నికుంట్ల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ నాగారపమ్మ తల్లి జాతర సందర్భంగా సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి,టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కొండూరు మురళి మోహన్ రాజు కట్టిన చాందిని బండికి పూజచేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News