నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంఘ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసి ఆందోళన బి.కొత్తకోట - తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం బడికాయలపల్లి -4వీవో సంఘమిత్ర భారతి పేరును ఆన్ లైన్ లో తొలగించిన గత ఏపిఎం మురళి పై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ , జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సలీం భాషా డిమాండ్ చేశారు సోమవారం సంఘ సభ్యులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ 2011 లో గ్రామ సమాఖ్య తీర్మానం ప్రకారం సంఘమిత్ర భారతి నీ సభ్యులు ఎన్నుకున్నారని తెలిపారు.అప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామ సమాఖ్య నడుపుతున్నారన్నారు 2024 నవంబర్ నుంచి ఆన్ లైన్ లో సంఘమిత్ర భారతి పేరును అప్పటి ఏపీఎం మురళి తొలగించారని ఆరోపించారు.సభ్యలు తీర్మానం చేయకుండా, సభ్యులకు సమాచారం లేకుండా అకారణంగా సంఘమిత్ర భారతి పేరును ఆన్ లైన్ లో తొలగించి అన్యాయం చేశారని, ప్రస్తుతం ఏపీఎం బ్యాంకు అధికారులకు భారతి నీ సంఘమిత్ర తొలగించామని చెప్పడం సమంజసం కాదన్నారు.జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంఘమిత్ర భారతి పేరును ఆన్ లైన్ లో నమోదు చేసి సంఘమిత్రగా కొనసాగించాలని,గత ఏపీఎం మురళి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాపితంగా ఆందోళనలు చేపడుతామన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు ఏఐటీయూసీ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి బత్తల వెంకటరమణ , జిల్లా ఉపాధ్యక్షుడు వేణు గోపాల్ రెడ్డి, సంఘమిత్ర భారతి, సభ్యులు రమణమ్మ, వెంకటలక్ష్మి, శంకరమ్మ, సులోచన, సుమిత్ర, లక్ష్మి దేవి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News