నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జూన్ 28 : విశ్వ హిందూ పరిషత్ గుర్రంకొండ వారి సహకారంతో ధర్మో రక్షతి రక్షితః పేరిట జరుగుతున్న శ్రీరామ కోటి నామ లిఖిత కార్యక్రమంలో ఇప్పటివరకు 200 పుస్తకాలు అనగా సుమారు 10,36,800(పది లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు)శ్రీరామనామాలు పూర్తి చేపించడం జరిగింది.ఇప్పటివరకు పూర్తి చేయించిన శ్రీరామ కోటి నామ లిఖిత పుస్తకాలను "ధర్మో రక్షతి రక్షితః" కార్యక్రమం నిర్వహణ సభ్యులు గుర్రంకొండ విశ్వ హిందూ పరిషత్ మండల ప్రఖండ తిరువీధి శ్రీధర్ మరియు గండి శ్రీ వీరాంజనేయ స్వామి మాలధారణ గురువులు ఉప్పు శ్రీనివాసులు గారికి చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగానూ మరియు పరోక్షంగానూ సహకరించిన ప్రతియొక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఎల్. ప్రసాద్, మావిళ్ళ శ్రీనివాసులు, ఎల్. అనిల్ కుమార్, పూజారి పద్మనాభం, ఎల్. వరుణ్ తేజ్, చింతిర్ల వెంకటేష్, బళ్లారి శ్రీనివాసులు, ఎస్.పి నవీన్ కుమార్ పి. హర్షిత్ కుమార్, ఎల్. లోహిత్ కుమార్ పాల్గొన్నారు. భక్తాదులు వ్రాసే ప్రతి 'శ్రీరామ కోటి' నామ లిఖిత పుస్తకాన్ని అయోధ్యలోని శ్రీరాముని పాదాల చెంత చేర్చబడునని తిరువీధి శ్రీధర్ ఈ సందర్బంగా తెలిపారు. గుర్రంకొండ కొత్తపేట వీధిలో ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ ఆలయము నందు ప్రతి ఆదివారం ఉదయం 08.00 గంటల నుండి 09.00 గంటల వరకు "ధర్మో రక్షతి రక్షితః" పేరిట శ్రీరామ కోటి నామ లిఖిత కార్యక్రమం ఉచితంగా నిర్విరామంగా జరుగుతుంది.కావున ఈ కార్యక్రమంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా, వయసుకు సంబంధం లేకుండా ప్రతియొక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము.
Admin
Namitha News