Thursday, 16 April 2026 04:59:39 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించి కేవలం 24 గంటల్లోనే స్వదేశానికి రప్పించేలా కృషి చేసిన జిల్లా ఎస్.పి శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐ.పి.ఎస్

ఒమన్ దేశంలో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న హసనాపురం షహీనను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడ

Date : 17 September 2024 08:47 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 17 : జిల్లా పోలీసు కార్యాలయం : ఒమన్ కష్టాల నుంచి సురక్షితంగా స్వస్థలానికి చేరిన హసనపురం షహీన(30) పిల్లల వినతి పై జిల్లా ఎస్పీ గారు స్పందించి సంబంధిత ఏజెంట్ తో మాట్లాడి కేవలం 24 గంటల్లోనే బాధితురాలిని స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టారు. బతుకుదెరువు కోసం ఒమన్ వెళ్లి చిత్ర హింసలకు గురవుతున్న హసనాపురం షహీన కన్నబిడ్డల వేడుకోలుతో పోలీసుల సాయంతో మోక్షం లభించింది. తల్లి పడుతున్న మనోవేదనను తట్టుకోలేని బాధితురాలి ఇద్దరు పిల్లలు జిల్లా పోలీసు కార్యాలయంలో 10 న "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" లో జిల్లా ఎస్పీ గారిని వేడుకున్నారు. వారి వినతి పై తక్షణం స్పందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ గారు ఒమన్ లో ఇబ్బందులు పడుతున్న బాధితురాలిని స్వదేశానికి రప్పించేందుకు విశేషంగా కృషి చేశారు. ఫిర్యాదు అందిన కేవలం 24 గంటల్లోనే బాధితురాలిని స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ గారు తన సిబ్బందితో చేసిన ప్రయత్నాలు ఫలించడంతో సెప్టెంబర్ 11 న ఒమన్ నుండి బయలుదేరి 12 న బుధవారం షహీన సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం, పెద్దూరు గ్రామానికి చెందిన షహీన తన కుటుంబాన్ని పోషించేందుకు ఈ ఏడాది ఆగస్టు 25 న హైదరాబాద్ నుండి ఒమన్ కు బయలుదేరి 26 న ఒమన్ దేశానికి చేరింది.

బిడ్డలు ఇద్దరినీ ఇంటి వద్దనే వదిలి తనవంతుగా కుటుంబానికి అండగా నిలిచేందుకు ఒమన్ దేశం వెళ్లింది. ఏజెంట్ మోసపూరిత వీసా తీయడం తో ఒమన్ దేశంలో తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఒమన్ వారు తనను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమై వీడియో ద్వారా బోరున విలపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి హృదయాలను కలిచివేసేలా వైరల్ అయ్యింది. అంతేకాకుండా ఆమె ఇద్దరు పిల్లలు జిల్లా ఎస్పీగారిని కలిసి తల్లి పడుతున్న బాధను విన్నవించు కున్నారు. తీవ్ర కష్టాలలో ఉన్న మా తల్లిని రక్షించి మా ఇంటికి రప్పించేలా చూడాలని వేడుకున్నారు. దీంతో ఎస్పీ గారు స్పందించి ఆమెను ఒమన్ దేశానికి పంపిన ఏజెంట్ను పిలిపించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఏజెంట్ ద్వారా కష్టాలలో ఉన్న షహీన ను ఇండియాకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు హసనపురం షహీన సురక్షితంగా స్వగ్రామానికి చేరడంతో హసనపురం షహీన కుటుంబీకులు ఆనందంతో జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం పోలీస్ శాఖకు రుణపడి ఉంటామన్నారు. జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించి కేవలం 24 గంటల్లోనే స్వదేశానికి బయలుదేరేలా తీసుకున్న చర్యల పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :