Thursday, 16 April 2026 06:40:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఆన్ లైన్ బెట్టింగ్ తో యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పద్మనాభ రెడ్డి ఆత్మహత్య

నాలా ఎవరూ మోసపోవద్దని సూసైడ్ నోట్

Date : 13 October 2024 07:59 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 13 ః తమ బిడ్డ బాగా చదువుకొని అవసాన దశలో పోషిస్తాడనుకున్న కన్నబిడ్డ ప్రయోజకుడై సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సంపాదిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ తన పాలిట శాపమై అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దిగువ గాలిగుట్టపల్లె లో వెలుగు చూసింది. కదిరి రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ భాష, స్థానికుల వివరాల మేరకు తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దిగువ గాలిగుట్టపల్లె గ్రామానికి చెందిన నడిమింటి వెంకటరమణారెడ్డి కుమారుడు పద్మనాభ రెడ్డి (27) చిన్న వయసు నుండి విద్యలో అగ్రగామిగా రాణించి తల్లిదండ్రుల ఆశయానికి అనుగుణంగా బెంగళూరులో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జీతానికి కుదిరాడు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డ ఉన్నత స్థాయికి ఎదుగుతాడని తమను పోషిస్తాడని గంపడాశతో సంతోషపడ్డారు. అయితే తాము ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్లు పద్మనాభ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొనసాగుతూ ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఈ బెట్టింగ్ లతో సుమారు 24 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు చెల్లించే మార్గం కానరాక ఇంట్లో చెప్పలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై మదనపల్లి మండలం సిటిఎం సమీపంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి నేను ఆన్లైన్ బెట్టింగు ఆడి లక్షలు పోగొట్టుకున్నాను. నాలాగా ఎవరూ ఆన్ లైన్ గేమ్ లు ఆడొద్దని అప్పులు తీర్చలేక తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని నేటి సాఫ్ట్ వేర్ యువతకు సందేశం ఇస్తూ సూసైడ్ నోట్ జేబులో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి గ్రామం సమీపంలోని రెడ్డివారి పల్లి వద్ద తిరుపతి నుండి మదనపల్లె వైపు వెళుతున్న రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. శనివారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు కనుగొని సిటిఎం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కదిరి రైల్వే పోలీస్ కానిస్టేబుల్ భాష ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. తొలిత రైలు పట్టాలపై ఎవరో కొట్టి చంపి పడేసినట్లు అనుమానించిన పోలీసులు సంఘటన స్థలంలో మృతుని సెల్ ఫోన్, లాప్ టాప్,ఆధార్ కార్డు, బెంగళూరులో పని చేస్తున్న కంపెనీ ఐడి కార్డ్ లను పరిశీలించి ఆత్మహత్యగా గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికి అంది వచ్చిన కుమారుడు ఇకలేడని తెలిసి అప్పు విషయం ఒక మాట కూడా చెప్పలేదు కదా నాయనా ఇక మాకు దిక్కెవరు బిడ్డా అంటూ బోరున విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలిసి వేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి మృతి విషయం తెలిసిన దిగువ గాలి గుట్ట పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :