నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపం లోని మల్లయ్య కొండలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ మూడు మాసాల హుండీ లెక్కింపు ద్వారా రూ 5,23,275 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో ముని రాజా, రికార్డు అసిస్టెంట్ కొండకిట్ట లు తెలిపారు. మంగళవారం ఉదయం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, ఉత్తమ రెడ్డి, టిడిపి నాయకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు , అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి అనంతరం టిడిపి నాయకులు, భక్తులు సుచిశుభ్రతతో ఆలయ ప్రధాన హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి ఆదాయం పెరగడం హర్షనీయమని భవిష్యత్తులో భక్తుల సౌకర్యార్థం తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధమ్మ, టిడిపి మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, రామచంద్రారెడ్డి, కాలా నారాయణ, బాలకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, నరసింహులు, ఆలయ అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News