Thursday, 16 April 2026 07:00:25 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌

Date : 08 September 2025 05:58 PM Views : 232

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. సోమవారం ముదివేడు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని కోరుతూ చీఫ్ ఇంజినీరు(ప్రాజెక్టులు), జలవనరుల శాఖ, కడప కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ముదివేడు రిజర్వాయర్‌ నిర్మించాలని తలపెట్టి అనేక అవకతవకలకు పాల్పడి రైతులను ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పోరాటం ఫలితంగా ముంపునకు గురయ్యే భూములను, ఇళ్లను గుర్తించడం కోసం ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి, అవార్డు కూడా ప్రకటించిందని గుర్తుచేశారు. దాదాపు 780 ఎకరాల భూములకు రూ. 163 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా 25 ఎకరాల భూమికి 1.75 కొట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని, మిగిలిన వారికి నష్టపరిహారం ప్రకటించినా అమలుకు నోచుకోలేదన్నారు. కురబలకోట, బి.కొత్తకోట మండలాల పరిధిలోని ఐదు గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారు. భూముల్లో మట్టిని తవ్వేసిన కారణంగా వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయాని, రిజర్వాయర్‌ నిర్మాణ సంస్థ రైతులకు లీజు చెల్లిస్తామని చెప్పి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదివేడు రిజర్యాయిర్‌ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, భూములు,ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ 5 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డికెటి పరిహారం ఇవ్యాలని, భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ. 5లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని పేర్కొన్నాపరు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేయని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం చీఫ్ ఇంజినీరు (ప్రాజెక్ట్స్) ఎం.ఎల్.ఎన్. వరప్రసాద్ కు వినతిపత్రం అందచేశారు. సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, నరసింహ, ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితుల సంఘం నాయకులు రాజేష్, శ్రీనివాసులు, వెంకట్రమణ, గోపాల్, వెంకటరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :