నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : ఆన్లైన్ ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమల ఎస్సై వెంకట నరసింహులు తెలిపారు. సోమల గ్రామంలోని ప్రజలకు ఆయన తగు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. రాత్రి వేళల్లో ప్రజలు అనవసరంగా బయట తిరగరాదని, ఎవరైనా అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం చేరవేయాలని కోరారు.
Admin
Namitha News