నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్ళపల్లి - మే 16 : రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ ద్యేయమని అందుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తంబళ్ళపల్లి నియోజకవర్గం దొమ్మన బావి వద్ద హంద్రీ - నీవా పనులను మంత్రి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష, నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు, పలువురు టిడిపి నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హంద్రీ - నీవా పనులను పరిశీలించి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి వీటన్నిటిని అధిగమించి హంద్రీనీవా కాలువను పూర్తిస్థాయిలో పారించి ప్రజలకు తాగునీరు సాగునీరు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో కలిసి తంబళ్లపల్లె వద్ద ఉన్న దొమ్మనబావి వద్ద ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టును పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. నీటి నిల్వ ప్రాంతాలు, ట్యాంకు కింద ఉన్న భూములు తదితర విషయాలను అధికారులతో చర్చించారు. హంద్రీ నీవా ద్వారా 3850 క్యూసెక్కుల నీటి సరఫరాకు ప్రణాళిక రచించి 90 శాతం పనులను ఆనాటి టిడిపి ప్రభుత్వం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో కాలువల్లో చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. సమ్మర్ స్టోరేజ్ వద్ద ఇసుకను దోపిడీ చేశారని ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేసి దోచు,కొన్నారు, ఇసుకను పూర్తిగా తోడెయ్యడంతో వర్షాధారం ద్వారా వచ్చే నీళ్ళు నిల్వ ఉండకుండా అడుగంటి పోవడం, లీకేజి సమస్యలు వస్తున్నాయి . భూగర్భ జలాల పెంపు సాగునీటి అవసరాల కోసం చెరువులను సంరక్షించాలని, రానున్న వర్షాకాలం కంటే ముందు చెరువుల్లో కూడికతీత పనులు చేపట్టాలని వీటన్నిటిని అరికట్టి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందిస్తామన్నారు. ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత రాయల సీమలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించి ప్రతి ఎకరాకు సాగునీరు, త్రాగు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈ, ఏఈలు,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News