నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆధార్ కార్డులు లేని పల్లె ప్రజలు... ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యేకు ఫిర్యాదుచేసిన గ్రామస్తులు.. మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ పంచాయితీ మొరవపల్లి గ్రామంలో 25 కుటుంబాల వారు నిరసిస్తున్నారు.. ఉప్పు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మరోవపల్లి గ్రామస్తులు వందమందికి పైగా ఇప్పటివరకు ఆధార్ కార్డు చేయించుకోలేదని నేడు నిర్వహించిన ప్రజా దర్బార్ లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు వినతి పత్రం సమర్పించారు... ఆధార్ కార్డులు భారతదేశ వ్యాప్తంగా మంజూరై 15 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఆధార్ కార్డులు చేయించుకోకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణం మొరవపల్లి గ్రామంలో క్యాంపు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్, సీతక్క యుగంధర్, ప్రసాద్, గుట్ట రమణ, మొరవ పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు...
Reporter
Namitha News