నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 02 : మదనపల్లె జిల్లా ఏర్పాటు పైన పాలక పక్షం ఇచ్చిన హామిని విస్మరించడం దారుణం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా తహసీల్దారు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహనికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లె జిల్లా ఏర్పాటు పైన పాలకులకు కనువిప్పు కలిగించాలని, కలలో కనిపించి గుర్తు చేయాలని వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ మదనపల్లె జిల్లా సాధన కోసం గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి మదనపల్లె జిల్లా చేయాలని డిమాండ్ చేయడంతో ఎన్నికల ముందు కూటమి అధినేతలు మదనపల్లె జిల్లా హామి ఇచ్చారు. నేటి కూటమి ప్రభుత్వం మదనపల్లె జిల్లా చేస్తామని హామీ ఇచ్చిందని అయితే కూటమి గద్దెనెక్కి ఒకటిన్నర సంవత్సరం అయిన జిల్లా ఏర్పాటు పైన ఎలాంటి అడుగు పడలేదని అన్నారు. మదనపల్లె జిల్లా వస్తుందా, రాదా అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయని, పలువురు అభిప్రాయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కే భాష, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు మామ షరీఫ్, మదనపల్లె టౌన్ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్, జిల్లా ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు రవీంద్ర, మదనపల్లి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లి టౌన్ మాజీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అలీ, మా పేరు ఎస్ కే భాష, భాను ప్రకాష్ రెడ్డి భయ్యా రెడ్డి వెంకటరమణ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News