నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 19 : తంబళ్లపల్లె మండలం లో నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా బుద్ధి మాంద్యం చిన్నారులను గుర్తించడానికి భవిత కేంద్ర నిర్వాహకులు రేఖ, శ్రావణి ల కృషి ప్రశంసనీయమన్నారు. బుధవారం భవిత కేంద్రంలో ఎంఈఓ త్యాగరాజు తో పాటు ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడు, పాఠశాల హెడ్మాస్టర్ సాంబశివాలు మాట్లాడుతూ భవిత కేంద్రాల ద్వారా బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థులలో సత్ఫలితాలు వస్తున్నాయని రాబోయే రోజుల్లో ఈ బుద్ధి మాంద్యం పిల్లలకు పాఠశాల విద్య పై అవగాహన పెంచి వారిలో ఆత్మ ధైర్యం నింపాలని సూచించారు. నేను బడికి పోతా కార్యక్రమం విజయవంతంలో సహకరించిన భవిత కేంద్ర సిబ్బందితోపాటు మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులను వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కేర్ టేకర్ రత్న బుద్ధి మాంద్యం పిల్లలు పాల్గొన్నారు.
Admin
Namitha News