నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 6 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో సోమవారం టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇంచార్జ్ జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు సస్పెండ్ కావడం పై నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో టిడిపి కి బలమైన నాయకుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, క్లస్టర్ ఇంచార్జి కాలా నారాయణ, ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రసానిపల్లి రామచంద్ర రెడ్డి, రామ్మూర్తి, యువ గళం బాలాజీ, నరసింహులు, కన్నె మడుగు సోమశేఖర్, గోపి దీన్ని మాజీ సర్పంచ్ సుధాకర్, దండువారిపల్లి రమణ, కుమార్ నాయుడు, కొటాల సుధాకర్, గంగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి, వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజులు, రామ్మూర్తి, నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News