నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం : అన్నమయ్య జిల్లా పిటియం మండలం గుగ్గిళ్లవారి పల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగి రైతు దుర్మరణం. పిటిఎం మండలం, గుగ్గిళ్ళపల్లి వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొని రైతు చౌడరెడ్డి దుర్మరణం చెందినట్లు పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. మండలంలోని నవాబు కోట పంచాయతీ, పెద్ద పొంగుపల్లెకు చెందిన రైతు చౌడరెడ్డి(65) తన వ్యవసాయ పొలంలో పనులు చేయడానికి కూలీల కోసం రాత్రి పొరుగు గ్రామానికి బైక్ లో వెళ్ళాడు. కూలీలను పిలిచి తిరిగి బైకులో ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని స్థానిక గుగ్గిళ్ళపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్ద తిప్ప సముద్రం మండలం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు.
Admin
Namitha News