Thursday, 16 April 2026 06:45:18 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సిపిఐ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయండి

Date : 30 July 2025 06:58 PM Views : 249

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సిపిఐ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయండి కడప బెంగళూరు రైల్వే లైన్ పనులు మదనపల్లి మీదుగా పుణప్రారంభించాలి బీటీ కళాశాల అభివృధి పేరుతో కళాశాలకు చితిని పెరుస్తున్న పాలకవర్గాలు సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సిపిఐ మదనపల్లి పట్టణ మహాసభ ఈరోజు స్థానిక ఎస్టియు కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప,సాంబశివ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన అన్నమయ్య జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని,ఈ జిల్లా పాలకుల పదవికాంక్షకు జిల్లా సమగ్రాభవృద్ధి బలవుతుందన్నారు.గత ప్రభుత్వ హయాంలోను,ఇప్పుడు కూటమి ప్రభుత్వం లోను జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని,నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెగిపోయిన ప్రాజెక్టులు, మరమ్మతులు కూడా చేయలేదని, కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగుళూరు రైల్వే లైన్ పనులు ఏమాత్రం ప్రారంభించలేదని,చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయని,మదనపల్లి నుండి రామసముద్రం,మదనపల్లి నుండి నిమ్మనపల్లి రోడ్లు చాలా ప్రమాదకరంగా మారాయని,రోజువారి ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని అయిన పాలకులు పట్టించుకోలేదని,ఎన్నికల సందర్భంగా నాయకులు రొడ్డును వెడల్పు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు తప్ప,అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ రోడ్డు సంగతి మర్చిపోతున్నారన్నారు.కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పి 4 పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుందని,పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా దూరం చేస్తుందన్నారు.బిటి కళాశాల అభివృద్ధి చేస్తామని పైకి చెబుతూనే, ఇంకోవైపు బిటి కళాశాలకు చితిని పేరుస్తున్నారన్నారు. త్వరలోనే బీటీ కళాశాల పైన పాలకులు మరియు అవినీతి పరులైన కొంతమంది చేస్తున్న కుట్రల పైన సిపిఐ,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కే మురళి సిపిఐ నాయకులు మాధవ్,రెడ్డి శేఖర్,తిరుమలప్ప,దేవా,ముబారక్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :