నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 30 ః తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాలలో పశువులకు టీకాలు సకాలంలో వేయడానికి వైద్య సిబ్బంది చొరవ చూపాలని మదనపల్లి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం తంబళ్లపల్లె పశువైద్య శిబిరంలో తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాల వైద్య సిబ్బందితో జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు తోబాటు పెయ్య దూడలకు బ్రూ సిలోసిస్ టీకాలు వేయడంతో పాటు పశువులకు టీకాలు వేయడానికి పాడి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మారుమూల గ్రామాలలో టీకాల కార్యక్రమం ముమ్మరం తో పాటు వర్షాకాలం ప్రభావంతో వచ్చే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ పూర్తి చేయాలని అదేవిధంగా ప్రభుత్వం మంజూరు చేసిన పశువుల గోకులం షెడ్లు, గొర్రెలు , మేకలు షెడ్లు నిర్మాణాలపై రైతుల అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిలు విశ్వేశ్వర్ రెడ్డి, సుమిత్రాదేవి, మండల డాక్టర్లు సుజన శ్రీ, విక్రమ్ రెడ్డి రెండు మండలాల పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News