నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పవిత్ర హజ్ యాత్ర సుఖ, సంతోషాలతో సాగాలి, క్షేమంగా వెళ్ళి రండి -- హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్ -- బెంగుళూరు హజ్ భవనంలో దగ్గర వుండి ఏర్పాట్లు పరిశీలన రాయలసీమ జిల్లాల నుండి పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న తోటి ముస్లింల యాత్ర సుఖ, సంతోషాలతో సాగాలని, క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ ఆకాంక్షించారు. రాయలసీమ జిల్లాల నుండి హజ్ యాత్రకు వెళ్తున్న వారికి బెంగళూరు హజ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుఫున ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక హజ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి దగ్గర వుండి ఏర్పాట్లు పరిశీలించిన పఠాన్ ఖాదర్ ఖాన్ హజ్ యాత్రకు వెళ్ళే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల ప్రత్యేక సలహాదారుల ఏంఏ.షరీఫ్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా లతో కలిసి రాష్ట్ర హజ్ కమిటి సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ స్కానింగ్, బ్యాగ్ ప్యాకింగ్, లోడింగ్, ట్యాగింగ్, రూమ్ అలాట్మెంట్, ఫూడ్ టోకన్స్ ఇలా అన్ని విధాల సౌకర్యాలను దగ్గర వుండి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు టిడిపి నాయకులు, సామిజికవేత్త సోహెల్ బాషా, సాజిద్, ఇంతియాజ్ పాల్గొన్నారు.
Reporter
Namitha News