నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డ ద్వారకనాథ్ రెడ్డి బుధవారం వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులతో కలసి మండలంలో విస్తృతంగా పర్యటిం చారు. మండలంలోని కమ్మచెరువు పంచాయతీ మొరుసుపల్లిలో గుండెపోటుతో మృతి చెందిన మల్ రెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొని కుటుంబీకు లను ఓదార్చారు. టి.సదుం పంచాయతీ గుంటిపల్లికి చెందిన నవీన్ అనే యువకుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడిని పరామర్శించారు. ఇదే పంచాయతీలో అనా రోగ్యం కారణంగా ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన నరసింహప్పను పరామర్శించారు. నవాబుకోట పం చాయతీ వరికసువుపల్లికి చెందిన సుధాకర్రెడ్డి కుమా రుడు పురిషిత్ రెడ్డి (14) రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తుమ్మరకుంట పం చాయతీ బురదలోల్లపల్లికి చెందిన గంగిరెడ్డి కుమా రుడు రాహుల్రెడ్డి (24) అనే యువ రైతు వ్యవ సాయం చేసి తీవ్రంగా నష్టాలు రావడంతో జీవితం పై విరక్తి పెంచుకుని గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం పాఠకు లకు తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే వెళ్లి మృతుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు అం డగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశమై మం డలంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.
Admin
Namitha News