Thursday, 16 April 2026 07:00:22 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత ఇళ్ళు గృహప్రవేశం

ఈనెల 24,25,26వ తేదీలలో శాంతిపురం మండలం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై పరిశీలించిన జిల్లా కలెక్టర్, జ

Date : 23 May 2025 07:42 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : శాంతిపురం - మే23: ఈనెల 24,25,26 వ తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల పై శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తో కలిసి పరిశీలించారు. ఈనెల 25 న శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామం వద్ద గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత ఇంటి గృహప్రవేశం కార్యక్రమం ఉన్నందున ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, సంబంధిత అంశాలపై అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెనింగ్ (ఏఎస్ఎల్)లో భాగంగా వి.కోట నుండి శాంతిపురం మండలం ముఖ్యమంత్రి గారి సొంతింటి వద్ద, గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్ నందు హెలిపాడ్,కుప్పం పి ఈ ఎస్ మెడికల్ వరకు భద్రతా ఏర్పాట్లును పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. వి.కోట నుండి కుప్పం వరకు రోడ్డు ప్రక్కన చెట్లు పొదలు తొలగించి, పారిశుధ్యం నిర్వహణ,హెలిపాడ్, మెడికల్ కళాశాల ముఖ్యమంత్రి గారి సొంతింటి వద్ద పరిసర ప్రాంతాల వద్ద శానిటేషన్ నిర్వహణ చేపట్టాలని పక్కా గా చేయాలని డిపిఓను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్య మంత్రి గారి సొంతింటి వద్ద వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేయాలని,ఆరోగ్య శాఖ వారి బృందం ఉండాలని, టెంపరరీ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పటిష్ట బ్యారీకేడింగ్ తో పాటు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ ఏఎస్ఎల్ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి,కుప్పం, పలమనేరు ఆర్డిఓలు శ్రీనివాస రాజు,డి పి ఓ సుధాకర్ రావ్, భవానీ,ఏఆర్ డిఎస్ పి.మహబూబ్ బాషా,ఆర్ అండ్ బి. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :