నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈనెల 5న (బుధవారం) మదనపల్లెలో కురబల ఆత్మీయ సమావేశం - జయప్రదం చేయాలని కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పిలుపు ఈనెల 5వ తేదీ అనగా (బుధవారం) ఉదయం 10 గంటలకు మదనపల్లె పట్టణం,రింగు రోడ్డు నందు గల శ్రీరామ కళ్యాణ మండపంలో కురబల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో ముఖ్యంగా పట్టణంలో శ్రీశ్రీశ్రీ శ్రేష్ఠ కనకదాస విగ్రహం ఏర్పాటు,కనకదాస భవన నిర్మాణం,వైకుంఠ రథం నిర్వహణ వ్యయం మరియు కురబ సంఘం డివిజన్ కమిటీలో మార్పులు,చేర్పులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, మరియు శివాలయం డైరెక్టర్ మల్లిక, వెంకటేశ్వర స్వామి దేవాలయం లో దుబ్బికాళ్ళ భాస్కర్, కదిరి మల్లికా రాజ్ కుమార్ లకు కృప సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.కావున డివిజన్ పరిధిలోని కురబ సంఘం నాయకులు,కురబ కులబాంధవులు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Reporter
Namitha News