Sunday, 13 September 2026 09:59:17 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మదనపల్లి లో వెల్లివేరిసిన మత సామరస్యం

హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో 11 ఏళ్ల నుండి అయ్యప్పస్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం హెల్పింగ్ మైండ్స్ సేవలను కొనియాడిన అయ్యప్పస్వామి భక్తులు సేవా కార్య

Date : 09 November 2025 05:31 PM Views : 236

నమిత న్యూస్ - Devotional / Annamayya : నవంబర్ 9: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదాన సేవలు,ఆకలితో ఉన్న వారి కోసం మదనపల్లి,గుర్రంకొండ ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంక్ సేవలు,అమ్మాయిల కోసం సానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు,క్యాన్సర్ భాదితులకు హెయిర్ డోనేషన్,ఆఖరి చూపు కోసం ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ బాక్స్ వంటి సేవా కార్యక్రమాలతో పలువురికి ఆదర్శంగా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ గత 11ఏళ్ల కాలం నుండి హిందు, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల మత సామరస్యం తో సోదర భావాన్ని పెంపొందిస్తూ పవిత్ర అయ్యప్ప స్వామి మాల ధరించిన అయ్యప్పస్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం జ్ఞానోదయా హై స్కూల్ నందు అయ్యప్పస్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో భిక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం మొదలు అయ్యప్ప స్వామి చిత్ర పటానికి పూజ నిర్వహించి, హారతి ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ బృందం అన్నదాన వితరణ చేశారు. హెల్పింగ్ మైండ్స్ సేవలు మరువలేనివని సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని అయ్యప్పస్వామి భక్తులు కొనియాడారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఆనవాయితీగా ప్రతి ఏటా సోదర భావం తో, మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఖాదర్ ఖాన్,సునీల్, హనీఫ్,సమీర్,కమ్మల ఆనంద్,నవీన్, సాయి దీపక్,రాహుల్,అమీన్,సైస వలి, ఉమర్, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :