నమిత న్యూస్ - Devotional / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 27: పుంగనూరు పట్టణం లో వెలసియున్న టీటీడీ శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం లో భాగంగా నాల్గవ రోజు ఉదయం స్వామి వారు రాజమన్నార్ అలంకారం లో కల్పవృక్ష వాహనం పై పుర వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం భాగ్యం కటాక్షించారు. వాహనం ముందు మంగళ వాయిద్యాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన కోలాట బృందాలు భజన, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఆలయంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ వారి సంగీత కార్యక్రమాలు వీనుల విందుగా, శ్రావణానందకరంగా కీర్తించారు. ఉదయం మరియు సాయంత్రం ఆలయం లో విశేష హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణం లోని ప్రజలు అడుగడుగున స్వామి వారికి కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు. ఆలయంలో ఉదయం సాయంత్రం అన్నప్రసాద వితరణ చేస్తూ గోవింద నామాల పుస్తక ప్రతులను భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు
Admin
Namitha News